చేవెళ్ల నియోజకవర్గం బ్యూరో న్యూస్ 2

Published: Friday October 28, 2022
టిటిడి కళ్యాణ మండప స్థలం పరిశీలన 
 
 చేవెళ్ల నియోజకవర్గం (బ్యూరో) 
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ చేవెళ్ల మండల కేంద్రంలో టిటిడి కళ్యాణ మండప నిర్మాణం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్న ఖాళీ స్థలం పరిశీలించిన చేవెళ్ల ఎమ్మెల్యే  కాలే యాదయ్య,ఆలయ కమిటీ సభ్యులు అనంతరం కాలే యాదయ్య మాట్లాడుతూ. టిటిడి కళ్యాణ మండప నిర్మాణం కోసం  తిరుమల తిరుపతి దేవస్థానం నూతన కళ్యాణ మండప నిర్మాణం కోసం  మన చేవెళ్ల గడ్డ మీద పెట్టడం ఎంతో గర్వకారణం అని ఎమ్మెల్యే యాదయ్య సూచించారు.
ఈ కార్యక్రమంలో
టిఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.