ఘనంగా డాక్టర్ కోటా రాంబాబు జన్మదిన వేడుకలు
Published: Monday June 07, 2021
మధిర, జూన్ 06, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీప్రజల మనిషి, ఎల్లప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ.మధిరలో కె వి ఆర్ హాస్పిటల్ స్థాపించి పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వైద్యసేవలు అందిస్తూ అనేక రకాల ఆపరేషన్లు చేసి ఎంతో మందికి ప్రాణదానం చేసిన వైద్యులు డాక్టర్ కోట రాంబాబు. ఒకవైపు వైద్య సేవలు అందిస్తూ, మరోవైపు తొలి అడుగు సేవా సంఘం స్థాపించి అనేక సేవ కార్యక్రమాలు నిర్వహించి పేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తెచ్చారు. మధిర నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలలో ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించి పేద ప్రజలకు ఇంటి వద్దకే వైద్యాన్ని తీసుకెళ్లిన మనసున్న మహారాజు డాక్టర్ కోటా రాంబాబు. కరోనా సమయంలో కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వైద్యసేవలు అందిస్తూ ఐసోలేషన్ సెంటర్లు నందు ఉంటున్న కరోనా బాధితులను పరీక్షించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. మధిర నియోజకవర్గ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజల పెన్నిదిగా ఖ్యాతి గడించిన డా.కోట రాంబాబు జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు
Share this on your social network: