జిల్లాలో మండల న్యాయ సేవా సదస్సు

Published: Friday May 20, 2022

మంచిర్యాల టౌన్, మే 19, ప్రజాపాలన : జిల్లాలోని మండల న్యాయ సేవా సంస్థ ఆధ్యర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును గుడిపేట గ్రామంలో గల 'పోలీస్ బెటాలియన్ యందు నిర్వహించడం జరిగింది. ఈ విజ్ఞాన సదస్సును మంచిర్యాల జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి నిర్వహించారు.  ఈ సదర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కలిగి ఉండాలని, ఉచిత సహాయాన్ని ఏవిధంగా పొందాలి అని, మండల న్యాయ సేవా సంస్థ ప్రజలకు అందిస్తున్న సేవల గురించి, వాటిని ప్రతి ఒక్కరు సద్వినియోగ పర్చుకోవలని,   సూచించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ, గంగయ్య, శిల్పిక శర్మ, పల్లవి, తాజుద్దీన్, రామకృష్ణ, హాజీపూర్ ఎస్ ఐ ఉదయ్ కిరణ్, పోలీస్ సిబ్బంది, మండల న్యాయ సేవ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.