సాయిబాబా ఆలయంలో "గురుపౌర్ణమి వేడుకలు"
Published: Thursday July 14, 2022
పూజ పాల్గొన్న జెడ్పిటిసి **
ఆసిఫాబాద్ జిల్లా జూలై 13(ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని "సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి" సందర్భంగా బుధవారం రాష్ట్ర సహాయ కార్యదర్శి, జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో బొమ్మన రామా గౌడ్, శ్రీశైలం, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Share this on your social network: