ప్రసిద్ది పొందుతున్న శ్రీలక్ష్మి నరసింహా స్వామి దేవస్థానం కు దారి లేక అవస్థ

Published: Saturday January 22, 2022

రాయికల్, జనవరి 21 (ప్రజాపాలన ప్రతినిధి); రాయికల్ మండలంలో భూపతిపూర్ గ్రామములో నక్కల గుట్ట మీద కొలువైన  శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయం, నిత్యం ఎంతో మంది భక్తులతో కిటకిటలాడుతు, వారు కోరుకున్న కోరికలు తీరుస్తూ, కొంగు బంగారమైన స్వామి వారి దేవస్థానానికి సరియైన రోడ్డు లేక భక్తుల వాహనా లకు, రాకపోకలకు చాలా ఇబ్బంది గామారింది. చెన్నమనేని కృష్ణారావు దంపతుల సహాయంతో, ఎంతోమంది దాతల సహాయ సహకారం అన్ని హంగుల తో నిర్మాణం చేసుకున్న ఆలయానికి ఈ రోడ్డు సమస్యగా మారింది. ప్రజా ప్రతినిదులకు, నాయకులకు ఎన్నిసార్లు విన్నవించు కున్న ఫలితం లేకుండా పోయింది ఇకనైనా స్పందించి 100 మీటర్ల రోడ్డు నిర్మాణం చేపడితే భక్తుల రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోతాయని ఆలయ చైర్మన్ సంకోజు మహేష్ బాబు, అర్చకులు వెంకటరమణ, వెంకట కృష్ణ మరియు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.