మధిర బీజేపీ నాయకులు అరెస్టు

Published: Wednesday November 17, 2021
మధిర నవంబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి : నిన్న సూర్యాపేట లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెరాస గుండాల దాడి నీ ఖండిస్తూ, సూర్యాపేట వెళుతున్న మధిర బీజేపీ నాయకులులను అక్రమంగా అరెస్ట్ చేశారు, ఈ రాష్టంలో ముఖ్యమంత్రి కెసిఆర్ నియత పాలనాచేస్తూ ప్రభుత్వ యాత్రంగాన్ని, నాశనం చేస్తూ పోలీస్ వ్యవస్థను తన చెప్పుచేతల్లో ఉంచుకొని, ప్రశ్నించే వాళ్ళను అక్రమ అరెస్టులు చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ, ఈ రోజు రాష్టంలో భయానాక వాతావరణం సృష్టిస్తూ, పైచాచిక ఆనందాన్ని పొందుతున్న, ముఖ్యమంత్రి, కెసిఆర్ గారికి, నాయకులకు ప్రజలు బుద్ది చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. అరెస్ట్ అయినవారిలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు చిలివేరు సాంబశివరావు, పట్టణ అధ్యక్షులు పాపట్ల రమేష్, బిజెపి రూరల్ మండల ఇంచార్జి రామిశెట్టి నాగేశ్వరావు, బీజేవైఎం జిల్లా కార్యదర్శి కాసిన నాగభూషణం, బీజేపీ ప్రధానకార్యదర్శులు బియ్యవరపు రామకృష్ణ, పగడాల నాగేంద్రబాబు, బిజెపి కార్యవర్గ సభ్యులు కుంచం కృష్ణారావు, బిజెపి ఉపాధ్యక్షులు మాదిరాజు సాయిరామ్ అరెస్ట్ అయినారు.