*బ్రాహ్మణ పరిషత్ నూతన భావన ప్రారంభోత్సవంలోశ్రీమతి మల్లు నందిని

Published: Monday January 30, 2023

మధిర జనవరి 29 ప్రజాపాలన ప్రతినిధి   మున్సిపాలిటీ పరిధిలో శివాలయం దేవాలయం వద్ద నూతనంగా నిర్మించిన బ్రాహ్మణ పరిషత్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో పాల్గొన్న శాసనసభ్యులు *శ్రీ మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ *శ్రీమతి మల్లు నందిని విక్రమార్క*. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలంటే మీరు దేవాలయంలో చేసే పూజలు చాలా ఆదర్శమని అందువలనే దేశం మరియు ప్రజలు సురక్షితంగా ఉన్నారని వారన్నారు ఈ కార్యక్రమంలో  బ్రాహ్మణ పరిషత్తు అధ్యక్షులు *వేమవరపు వెంకటేశ్వర శర్మగారు*. మాజీ మార్కెట్ *చైర్మన్ రంగా హనుమంతరావు* మాజీ శివాలయం చైర్మన్ *పాటిబండ్ల సత్యంబాబు* మాజీ సర్పంచ్ *బొమ్మకంటి హరిబాబు* మధిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు *దారా బాలరాజు* డివిజన్ నాయకులు *ఆదిమూలం శ్రీనివాస్* తదితరులు  పాల్గొన్నారు.