మండలంలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Published: Tuesday August 30, 2022
జన్నారం, ఆగస్టు 29, ప్రజాపాలన: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య మండలంలో విషాదాన్ని చోటుచేసుకుంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన జక్కుల అంజిత్ 21 సం,లు హైదారాబాదులోని గాయత్రి విద్యాసంస్థలో ఇంటర్ చదివాడు. ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం దృవపత్రలు ఇమ్మని అడగగా, పూర్తి పీజు డబ్బులు చేల్లిస్తేనే దృవపత్రలు ఇస్తామని చెప్పారు. అ సమయానికి ఇంట్లో డబ్బులు చేల్లించని పరిస్థితి. ఎంసెట్ కౌన్సెలింగ్ తప్పు తానన్న మనస్థాపంతో (ఆందోళనతో) పురుగుల మందు సేవించాడు. కుటుంబ సభ్యులు హూటహుటిగా ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
Share this on your social network: