రామాపురం అర్ధరాత్రి న్యూ పాఠశాలలో చోరీ తలుపులు పగలగొట్టి ఫర్నిచర్ ధ్వంసం చేసిన వైనం
Published: Thursday April 06, 2023
బోనకల్, ఏప్రిల్ 5 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రామాపురం న్యూ ప్రాథమిక పాఠశాలలో గుర్తు తెలియని దుండగులు తలుపులు పగలగొట్టి ఫర్నిచర్ ని ధ్వంసం చేసి చోరీకి పాల్పడిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు రామాపురం గ్రామంలో ఇటువంటి నూతనంగా నిర్మించిన యుపిఎస్ పాఠశాలలో మంగళవారం రాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు తలుపులు పగలగొట్టి ఫర్నిచర్ తో పాటు గ్రామ పంచాయతీకి సంబంధించిన వస్తువులను ఎత్తుకెళ్లడం జరిగిందని వాళ్ళు తెలిపారు. న్యూ ప్రాథమిక పాఠశాలలో గ్రామ పంచాయతీకి సంబంధించిన వస్తువులు ఇనుము, పైపులు వంటివి ఎత్తుకెళ్లారని వారు అన్నారు. ఇట్టి ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Share this on your social network: