మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

Published: Wednesday June 23, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని పులిగిల్ల గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ జిల్లా నాయకులు వేముల మహేందర్ అనారోగ్యంతో మరణించారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించి వెలువర్తి గ్రామానికి చెందిన కలుకూరి భిక్షపతి- వెంకటమ్మ, పులిగిల్ల గ్రామానికి చెందిన వడ్డేమాను వెంకటయ్య- పద్మ కుటుంబ సభ్యులు 10 వేల రూపాయల ఆర్దిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపన్ని తెలియజేసి ఒక మంచి నాయకుని కోల్పోయామని వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపారు.