అయ్యప్ప స్వాములు ఆర్టీసీ సేవలను వినియోగించుకోండి** ఆర్టీసీ సేవల ఫ్లెక్సీ ఆవిష్కరణ

Published: Friday December 09, 2022

ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 8 (ప్రజాపాలన, ప్రతినిధి) :  కేరళలోని పుణ్యక్షేత్రమైన శబరిమల యాత్రకు వెళ్లే స్వాములు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ శ్రీధర్, గురు స్వామి గాదేవేణి మల్లేస్ లు కోరారు. గురువారం జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి  ఆలయ ఆవరణలో శబరిమలకు వెళ్లే బస్సు కు సంబంధించిన ఫ్లెక్సీ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శబరిమలకు వెళ్తున్న భక్తుల కోసం 36 సీట్లతో కూడిన సూపర్ లగ్జరీ, 44 సీట్లతో కూడిన డీలక్స్,49 సీట్లతో ఎక్స్ప్రెస్, సర్వీసులు అందుబాటులో ఉన్నాయన్నారు. ముందుగా బుకింగ్ చేసుకున్న వారికి బస్సు టికెట్లు 10 శాతం రాయితీ లభిస్తుందని, ఈ అవకాశం డిసెంబర్ 31 వరకు మాత్రమే వర్తిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గురు స్వాములు శ్రీమంతుల వేణుగోపాల్ స్వామి, ఖాండ్రే విశాల్ స్వామి, శ్రీనివాస్ స్వామి, దేవునూరి రమేష్ స్వామి, మహేష్ స్వామి,తదితరులు పాల్గొన్నారు.