రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో 25 వేల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు

Published: Monday March 28, 2022
మేడిపల్లి, మార్చి 27 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు 25 వేల సభ్యత్వాలు నమోదైన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వంకగా కలసి సభ్యత్వ నమోదుల యొక్క రూ 6 లక్షల 25 వేల రూపాయల చెక్కును అందజేశారు. ఈసందర్భంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  రాగిడి లక్ష్మారెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమనికి ఉప్పల్ నియోజకవర్గంలోనీ కాంగ్రెస్ నాయకులు, నాచారం డివిజన్ ఇంఛార్జి మేడల మల్లికార్జున్ గౌడ్, మల్లాపూర్ డివిజన్ ఇంఛార్జి వంగెటి సంజీవ్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంజయ్ జైన్, జిల్లా ఎక్స్ ఐవైసీ కో ఆర్డనేటర్  వినోద్ ముదిరాజ్ ఎస్ టి సెల్ చైర్మన్ గణేష్ నాయక్ గణేష్ నాయక్ జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కారిపే సంతోష్ కుమార్ షబ్బీర్ ఫసిఉద్దిన్ మురళి కృష్ణ ముదిరాజ్ సాదినేని సాయి మల్లేష్ శ్రీనివాస్ రెడ్డి పుల్ల ప్రశాంత్ మల్లిఖార్జున్ రాజు నాయక్ రామంతపుర్ గుప్తా గ్యార కిరణ్ కిషన్ నాయక్ రమేష్ నాయక్ స్టార్ రెడ్డి రాజేష్ శ్రీకాంత్ నాయక్ పుల్లరెడ్డి బొల్లు వెంకట్ మహేష్ సన్నీ గౌడ్ లీలావతి సుజాతా నాయక్ భారతమ్మ లక్ష్మి పద్మ 300 మంది కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు.