ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 23 ప్రజాపాలన ప్రతినిధి *దళిత టీచర్ పై ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ గుండాల దాడ

Published: Tuesday January 24, 2023
రంగారెడ్డి జిల్లా ప్రజాసంఘాల భావ ప్రకటన స్వేచ్ఛ జేఏసీ ఆధ్వర్యంలో దళిత మల్లికార్జున టీచర్ పై ఆర్ఎస్ఎస్ బజరంగ్దళ్ గుండాల దాడిని నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం చేయడం జరిగింది
ఈ సందర్భంగా కెవిపిఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామెల్ వృత్తి సంఘాల నాయకులు పగడాల యాదయ్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి  ప్రజాసంఘం నాయకులు మాట్లాడుతూ
దళిత టీచర్ అయినటువంటి మల్లికార్జున పై దాడిని నిరాసిస్తూ భారత నాస్తిక సమాజం బావ ప్రకటన స్వేచ్ఛ లేని కారణంగా ఈరోజు కుల వివక్షవ్యతిరేక పోరాట సంఘం ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో  బావ ప్రకటన స్వేచ్ఛ జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తా వద్ద మానవహారంగా నిరసన తెలుపడం జరిగింది దిం9 ముఖ్య ఉద్దేశము మనువాద సమాజం 100సంవత్సరాల కింద జరుగుతున్నటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు అమలు చేయడానికి బిజెపి ఆర్ఎస్ఎస్ జరుగుతున్న మూక దాడులను నిలిపివేయాలని రాజ్యాంగం ముందు  అందరు సమానులే అని అన్ని సంఘాల వారు పోరాటం చేయాలని ఈ నిరసన దరా తెలుపడం అయినది పోరాటంలో కార్యక్రమంలో పాల్గొన్న వారు స్వచ్ఛ జేఏసీ అన్ని ప్రజా సంఘాలు కెవిపిఎస్ ప్రకాష్ కరత్, డివైఎఫ్ఐ  జగన్,వ్యాకస జగన్, ఐద్వా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయమ్మ సుమలత ,ఉమ,ఎస్ఎఫ్ఐ నాయకులు పల్లవి మస్కు చరణ్ తరంగ్ నాస్తిక సమాజం నాయకులు జంగయ్య గారు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు,