ప్రభుత్వ పాఠశాలలలో ఆకస్మిక తనిఖీలు శంకరపట్నం ప్రజాపాలన మార్చి 10:

Published: Saturday March 11, 2023

శంకరపట్నం మండల పరిధిలోని   , కేశవపట్నం, కొత్తగట్టు, తాడికల్, ముత్తారం ఉన్నత పాఠశాలలలో శుక్రవారము తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా పదవ తరగతి పిల్లల చదువులపై జిల్లా పర్యవేక్షణ బృందం సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థుల చదువుల పై ఆరా తిసారు. ఉపాధ్యాయుల తో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడ పిల్లల చదువుల్లో ప్రత్యేక శ్రద్దవహించాలని వారు అన్నారు. ఈ తనిఖీలలో జిల్లా పర్యవేక్షణ బృందం డి.శ్రీనివాస్, ఎ.అనంత చారి, శ్రీధర్, బాలాజీలతో పాటుగా మండల విద్యాధికారి నరసింహారెడ్డి పాల్గొన్నారు.