హోళీ రంగులు తమ జివితాలలో వెలుగులు నింపాలి

Published: Tuesday March 30, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 29 ( ప్రజాపాలన ) : హోళీ రంగులు తమ జీవితాలలో వెలుగులు నింపాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సబితా ఆనంద్ ఆస్పత్రి ఆవరణలో హోలీ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వికారాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ ముత్యం రెడ్డి ఏఎంసి చైర్మన్ విజయ్ కుమార్, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, సురేష్, నవీన్ కుమార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.