చీమల్ దరి గ్రామంలో మీతో నేను
Published: Monday December 19, 2022
గ్రామ సర్పంచ్ నాసన్ పల్లి నర్సింహారెడ్డి
వికారాబాద్ బ్యూరో 18 డిసెంబర్ ప్రజా పాలన : గ్రామంలోని అపరిస్కృత సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకొనుటకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీతో నేను కార్యక్రమంలో భాగంగా మంగళవారం చీమల్ దరి గ్రామానికి రానున్నారని గ్రామ సర్పంచ్ నాసన్ పల్లి నర్సింహారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ఆర్థికంగా సహకారం అందించాలని కోరుతానని అన్నారు. దీర్ఘకాలిక అపరిస్కృత సమస్యలను పరిష్కరించేందుకు సహకారం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనునిత్యం తపిస్తున్న వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కు ఘన స్వాగతం పలుకుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.
Share this on your social network: