దివ్యాంగులకు అన్నదానం, దుప్పట్లు పంపిణి

Published: Tuesday March 16, 2021

మధిర, మార్చి 15, ప్రజాపాలన ప్రతినిధిమండల పరధిలోని రాయపట్నం గ్రామానికి చెందిన రైతు కుటుంబీకులు స్వర్గీయ శ్రీ తేళ్ళ వెంకాయమ్మ w/o ప్రకాశరావు జ్ఞాపకార్థం వారి కుమారులు అయినటువంటి రిటైడ్ ఏఎస్ఐ శ్రీ తేళ్ళ బుచ్చిలక్ష్మణ్రావు, తేళ్ళ పూర్ణచందర్రావు మరియు కొండలరావు (లేట్ )మరియు వారి కుటుంబసభ్యుల సహకారంతో అన్న దానం నూతన దుప్పట్లు మరియు ఏసీ కూలర్ లు ప్రిన్సిపాల్ స్వర్ణ, ప్రముఖ సామజిక సేవకుడు లంకా కొండయ్య చేతులు మీదుగా వారు మానసిక వికలాంగపిల్లలకు అందచేసినారు.ఈ లక్ష్మణరావు మాట్లాడుతూ లో ఈ లాంటి మానసిక దివ్యాంగ పిల్లలను ప్రేమ తో ఆదుకోవలని "మానవ సేవే మాధవసేవగా" భావించి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ స్వర్ణకుమారి, కేర్ టేకర్ నారి కుమారి వితరణ  లక్ష్మణ్ రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.