కోరుట్ల ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా రక్త దానం చేసిన టీఅర్ఎస్ నాయకులు

Published: Thursday November 11, 2021
కోరుట్ల, నవంబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు జన్మదిన సందర్భంగా కోరుట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పొట్ట సురేందర్ మెట్ పల్లి పట్టణం లోని రాడ్న్య బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వుండి,కోరుట్ల నియోజక వర్గ అభివృద్ధికి మరింత తోర్పాటు అందించాలని కోరారు.