పేదలకు అండగా సీఎం సహాయనిధి
Published: Wednesday September 01, 2021
కార్పొరేటర్ రాజేశ్వరి అంజిరెడ్డి
మేడిపల్లి, ఆగస్టు 31(ప్రజాపాలన ప్రతినిధి) : అనారోగ్య పాలై ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తుందని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 26వ డివిజన్ కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి పేర్కొన్నారు. పీర్జాదిగూడ కార్పొరేషన్ నివాసి బి.పావని, బి.విష్ణు వైద్య ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 1,50,000 రూపాయల చెక్కును వాకిటి శ్రీకాంత్ రెడ్డి ద్వారా మంజూరు చేయించారు. మంజూరైన చెక్కును కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి డివిజన్ కార్యాలయంలో బాధితులకు అందజేశారు.
Share this on your social network: