కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అస్సాం సీఎం పై బోనకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

Published: Tuesday February 15, 2022
బోనకల్, ఫిబ్రవరి 14 ప్రజాపాలన ప్రతినిధి : బోనకల్ మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ విశ్వ శర్మ పై టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మధిర శాసనసభ్యులు సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క ఆదేశంతో సోమవారం బోనకల్ పోలీస్ స్టేషన్ లో బోనకల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాలి దుర్గారావు, ఖమ్మం జిల్లా డిసిసి కార్యదర్శి పైడిపల్లి కిషోర్ బాబు బోనకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో కర్నాటి కోటి, చొప్పకట్లపాలెం సర్పంచ్ సుబ్బారావు, నల్లమోతు సత్యనారాయణ, కో ఆప్షన్ సభ్యులు జమాలుద్దీన్, బద్రు నాయక్, బానోత్ శీను. చేబ్రోలు మల్లికార్జున్, మురళి, దొంతు నారాయణ తదితరులు పాల్గొన్నారు.