14న ముట్టడిని జయప్రదం చేయాలి.. సీపీఐ నాయకులు రమేష్
Published: Tuesday December 13, 2022
తల్లాడ, డిసెంబర్ 12 (ప్రజా పాలన న్యూస్): తల్లాడ మండల కేంద్రంలో తమ్మారపు వెంకటేశ్వర్లు ఇంటి వద్ద సీపీఐ తల్లాడ మండల సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కార్యదర్శి ఓర్సు రమేష్ మాట్లాడుతూ తల్లాడ మండలంలో అన్ని గ్రామాలలో అనేక సమస్యలు ఉన్నాయని, డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు పేదవాడికి ఇచ్చిన పరిస్థితి లేదన్నారు. ఇకనైనా స్థలం ఉండి ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించాలని, స్థలం కూడా లేని వారికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలన్నారు. స్థానికంగా రేషన్ కార్డులను కొత్తవి ఇవ్వాలని, అర్హులై ఉన్నవారికి పింఛన్లు ఇవ్వకపోవడాన్ని నిరసించి పింఛన్లు ఇవ్వాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, గ్యాస్ విద్యుత్ పెట్రోల్ ధరలు తగ్గించాలని వీటిపై 14వ తారీఖున ఆఫీస్ ముట్టడి చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అమర వెంకటేశ్వర్లు, నాగమణి, సరస్వతి, పాల్గొన్నారు.
Share this on your social network: