అంబేద్కర్ చౌరస్తావద్ద నిరసన వ్యక్తం చేశారు

Published: Friday January 28, 2022

ఇబ్రహీంపట్నం జనవరి 27 ప్రజాపాలన ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు బూడిద నర్సింహారెడ్డి, దండే శ్రీశైలం యాదవ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో అంబేద్కర్ వద్ద నిరసన వ్యక్తంచేయడం జరిగింది నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వెళ్లగా ఎంపీ అరవింద్ గారి పై మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పై తెరాసా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనుచరులు తెరాసా నాయకులు దాడి చేయడం జరిగింది టిఆర్ఎస్ నాయకులు మతిభ్రమించి వ్యవహారం చేస్తున్నారని రోజురోజుకు భారతీయ జనతా పార్టీకి ప్రజా ఆదరణ పొందుతున్నదని దుబ్బాక, హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టిఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేక పోతుంది రాజ్యాంగనికి విరుద్ధంగా వ్యవహారం చేస్తున్నారు ప్రజా ప్రతినిధులకు రక్షణ కరువైంది, పోలీసులు ప్రభుత్వ నికే కొమ్ము కాస్తున్నారు. తెరాస నాయకులు గుండా లాగా వ్యవహరిస్తున్నారని  వనపర్తి జిల్లా ఇంచార్జ్ బోసుపల్లి ప్రతాప్ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ఇంచార్జ్ బోసుపల్లి ప్రతాప్, జిల్లా ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ సత్యనారాయణ, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు జక్కరవీందర్ రెడ్డి, ఏన్ను యాదగిరి రెడ్డి, నరసింహా రెడ్డి, మేకల సత్యనారాయణ మోర్చా అధ్యక్షులు శేఖర్ రెడ్డి, శేఖర్, మహేందర్ బాలకిషన్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు