ఊరు పోచమ్మ బోనాల ఉత్సాహాలను నిబంధనల ప్రకారం జరుపుకోవాలి

Published: Friday August 20, 2021
కర్ణంగూడ సర్పంచ్ వంగేటి కవిత తిరుమల్ రెడ్డి
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 19, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని కర్ణంగూడ గ్రామ సర్పంచ్ వంగేటి కవిత తిరుమల్ రెడ్డి ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఆదివారం జరగబోయే ఊర పోచమ్మ బోనాల ఉత్సవాల సందర్భంగా గ్రామంలో బోనాల పండగకు గ్రామ ప్రజలంతా సహకరించి, కరోనా నిబంధనలు పాటించాలని కోరుతున్నామని సర్పంచ్ కోరారు. గత సంవత్సరం కరోనా కారణంగా పోచమ్మ బోనాల ఉత్సవాలను గ్రామ ప్రజలు ఆనందంగా జరుపుకో లేకపో యారని అన్నారు. ఆదివారం జరగబోయే బోనాలకు  ప్రతి ఒక్కరుమాస్కులు ధరిస్తూ ఉత్సవాలను, అంగరంగ వైభవంగా డప్పు సభ్యులతో పోతరాజుల విన్యాసాల నడుమ నిర్వహిస్తున్నందున అమ్మవాని దర్శించుకుని మాత కృపా కటాక్షాలకు పాత్రులు కావాలన్నారు. ఊర పోచమ్మ బోనాల ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ప్రజలు అధికారులకు,  గ్రామపంచాయతీ పాలకవర్గానికి సహకరించాలని సర్పంచ్ వంగేటి కవిత తిరుమల్ రెడ్డి అన్నారు.