ఉప్పల్లో గోవర్ధన్ బ్యాడ్మింటన్ అకాడమీ ప్రారంభించిన కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి

Published: Monday November 22, 2021
మేడిపల్లి, నవంబర్ 20 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ విజయపురి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన  బ్యాడ్మింటన్ అకాడమీని స్థానిక కార్పొరేటర్ మందముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు.ఆదివారం అకాడమీ ప్రారంభోత్సవానికి రజితపరమేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.బ్యాడ్మింటన్లో ఉత్తమ క్రీడాకారులుగా యువకులను తీర్చిదిద్దాలన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో రాణిస్తూ, ఉప్పల్ ప్రాంతానికి గుర్తింపు తేవాలని కోరారు. ఈ కార్యక్రమమంలో బొమ్మగోని దాస్ గౌడ్, తెల్కల మోహన్ రెడ్డి, జెట్ట కిషోర్, బొమ్మగోని ప్రవీణ్, బొమ్మగోని సాయి, తెల్కల సుజీత్ రెడ్డి, మంద మురళీకృష్ణ రెడ్డి ,శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.