ధరూర్ వాకర్స్ అసోసియేషన్ కు ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ లో సభ్యత్వం

Published: Monday October 17, 2022
జగిత్యాల, అక్టోబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి):  ధరూర్ క్యాంప్ కోదండ రామాలయం కళ్యాణ మండపంలో ధరూర్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సభ్యుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ధరూర్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకోగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం వాకింగ్, యోగా చేస్తూ ఆరోగ్యంగా ఉంటూ సమాజ సేవలో కూడా వాకర్స్ అందరూ పాల్గొని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి చేయూతనివ్వాలని కోరారు. వాకర్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. ధరూర్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులైన ఐలనేని వెంకటేశ్వరరావు మరియు కార్యవర్గ సభ్యులకు సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, నరసింహారావులు పాల్గొన్నారు. మరియు రైల్వే గేట్ వాకర్ అధ్యక్షులు రాజయ్య ,మినీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి, ఎస్ కె ఎన్ ఆర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్ర నర్సయ్య గారు మాజీ అధ్యక్షులు రామచంద్రం, సలహా కమిటీ సభ్యులు బోయినపల్లి ప్రసాదరావు ట్రెజరర్ సునీల్ కుమార్ ఉపాధ్యక్షులు ప్రతాప్ శేఖర్ సత్యం, వీరబత్తిని శ్రీనివాస్ బూస గంగాధర్ మల్లారెడ్డి ప్రకాష్, తిరుపతి రెడ్డి, సత్యం రావు, సుధాకర్ రావు పాల్గొన్నారు.
 
 
 
Attachments area