మర్పల్లి ఆసుపత్రిలో కేఎల్ఆర్ ట్రేడర్స్ పిపిఈ కిట్లు పంపిణీ

Published: Friday August 20, 2021

బంట్వారం మాజీ పిఏసిఎస్ చైర్మన్ కెరెల్లి లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థంగా వారసుల సామాజిక సేవ

వికారాబాద్ బ్యూరో 19 ఆగస్ట్ ప్రజాపాలన : కరోనా మహమ్మారి నుండి రక్షణ పొందేందుకు పిపిఈ కిట్లు పంపిణీ చేశామని కెరెల్లి బలవంత్ రెడ్డి, కెరెల్లి సంజీవరెడ్డి, రాజేందర్ రెడ్డి లు సంయుక్తంగా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బంట్వారం మాజీ పిఏసిఎస్ చైర్మన్ కెరెల్లి లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థంగా అతని వారసులు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. అందులో భాగంగా మర్పల్లి, బంట్వారం, కోటపల్లి మండలాలలోని బస్ స్టాండులలో 30 బెంచీలను ఏర్పాటు చేశామని వివరించారు. మర్పల్లి ఆసుపత్రికి 30 పిపిఈ కిట్లు అందజేశామని చెప్పారు. బంట్వారం, మర్పల్లి ఆసుపత్రులలో త్వరలో రోగులకు సౌకర్యార్థం బెంచీలు ఏర్పాటు చేయనున్నామని ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ జహీర్ పాష తదితరులు పాల్గొన్నారు.