ట్రైబల్ రుణాల దరఖాస్తుల గడువు పొడగింపు

Published: Thursday March 18, 2021
జిల్లా గిరిజన అభివృద్ధి  శాఖ అధికాారి కోటా
వికారాబాద్ జిల్లా ప్రతినిధి మార్చి 17 ( ప్రజాపాలన ) : గిరిజన ఆర్థిక సహకార సంస్థ పథకం ద్వారా లబ్ది పొందుటకు  గాను ఆన్ లైన్ దరఖాస్తుల గడువు పొడిగింపు సరైనదని జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికారాబాద్ జిల్లా ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంత గిరిజనులకు 2020-21 సంవత్సరానికి గాను (213) యూనిట్లు గిరిజనులకు వ్యవసాయ సంబంధ పశు సంవర్ధక చిన్న నీటి పారుదల చిరు వ్యాపారం మొదలగు పథకముల కొరకు జిల్లా గిరిజన ఆర్థిక సహకార సంస్థ పథకం ద్వారా లబ్ది పొందుటకు గాను ఆన్ లైన్ www. tsobmms. cgg.gov.in ద్వారా తేది: 15.03.2021 నుండి 31.03.2021 వరకు పొడిగించడం జరిగింది. కావున అర్హులైన గిరిజన లబ్దిదారులు 31.03.2021 వరకు దారఖాస్తు చేసుకోగలరు.