సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

Published: Wednesday June 30, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 
వికారాబాద్, జూన్ 29, ప్రజాపాలన బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 30వ వార్డులోోని ప్రతాప్ గిరి కాలనీలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రతి పట్టణంలో ఒక ప్రత్యేకమైన నర్సరీ వైకుంఠధామం, కంఫోస్టు షెడ్డు ఇలాంటివి ఎన్నో మొదలైన నిర్మాణాలు చేపడుతుందన్నదని గుర్తు చేశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త నిర్మాణాలు చేపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ల పల్లి మంజుల రమేష్, స్థానిక కౌన్సిలర్  బోండల సువర్ణ అశోక్, మాజీ కౌన్సిలర్ బోండల శ్రీనివాస్  కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, గోపాల్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేష్ కుమార్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, సుభాన్ రెడ్డి, ఏఈ రాయుడు, కాలనీ వాసులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.