ముదిరాజ్ సంఘం నూతన ఫంక్షన్ హాల్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

Published: Monday October 18, 2021

కోరుట్ల, అక్టోబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలంలోని ఐలాపూర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం నూతనంగా నిర్మించిన ఫంక్షన్ హాల్ని కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి నిధులు నాలుగు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, మరో ఆరు లక్షల రూపాయల సిడిపి నిధులను మంజూరు చేస్తానని తెలిపారు. ఐలాపూర్ గ్రామంలో ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టడం పట్ల సంఘం వారిని అభినందించారు. నియోజకవర్గంలోని అన్ని కులాల అభివృద్ధి కోసం పాటుపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట నారాయణ, జడ్పీటీసీ దారిశెట్టి లావణ్య రాజేష్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు చీటి వెంకట్రావు, స్థానిక సర్పంచ్ పిడుగు రాధా సందయ్య, ఎంపీటీసీలు వనిత సంజీవరెడ్డి, గంగాధర్, సింగిల్విండో చైర్మన్ సాయిరెడ్డి, ఉప సర్పంచ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్ సురేష్ గౌడ్, పలు గ్రామాల సర్పంచులు అంజయ్య, భీమ రెడ్డి, రాజా నర్సయ్య, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు, మండల నాయకులు, జిల్లా నాయకులు, తెరాస నాయకులు అనంత స్వామి, వెంకట స్వామి, సతీష్, వికాస్, శ్రీను, నరేందర్ రెడ్డి, గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.