ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 1ప్రజాపాలన ప్రతినిధి **జన సంద్రంగా మారిన తుర్కయంజాల్ మున్సిపాలిటీ.

Published: Thursday March 02, 2023

ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 39వ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు  మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి (బంటి)  మరియు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి  ఈరోజు ఉదయం పాదయాత్రతో ఓఆర్ఆర్ నుంచి తుర్కయాంజల్ మున్సిపాలిటీలోకి ప్రవేశించటం జరిగింది.
జన సంద్రంగా మారిన తుర్కయంజాల్ మున్సిపాలిటీ.
తుర్కయంజాల్ మున్సిపాలిటీ లోకి ప్రవేశించిన ప్రగతి నివేదన యాత్ర
500 కిలోమీటర్ల మైలురాయిని దాటిన సందర్భంగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  హజరై పైలాన్ ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు.ప్రజలు, నన్ను వారి సొంత కొడుకు లాగా ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు.నియోజకవర్గంలో 2,391కోట్ల తో అభివృద్ధి పనులు చేశాం.కేసీఆర్ నాయకత్వానికి మద్దతు ఇస్తే భవిష్యత్తులో మరిన్ని నిధులు, అభివృద్ధి పనులు.యాంజల్ మున్సిపాలిటీలో అభివృద్ధి నిరోధకలుగా ప్రతిపక్షాలు అని బంటీ  అన్నారు. ఈ కార్యక్రమంలో డి సి సి బి వైస్ చైర్మన్ కొత్త కురుమ సత్తయ్య, ఆదిభట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ కొరకలమ్మ జంగయ్య, తుర్కయంజాల్ మున్సిపల్ అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి, కౌన్సిలర్స్, ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్, యువజన విభాగ అధ్యక్షుడు జర్కోని రాజు, బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు మహిళా కార్యకర్తలు బీ ఆర్ఎస్వి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు,