మున్సిపల్ సిబ్బందికి బట్టలు పంపిణీ చేసిన కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్

Published: Tuesday October 12, 2021
మేడిపల్లి, అక్టోబర్ 11 (ప్రజాపాలన ప్రతినిధి) : దసరా పండుగను పురస్కరించుకొని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్ మున్సిపల్ సిబ్బందికి కొత్త బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్ మాట్లాడుతూ డివిజన్లో మున్సిపల్ సిబ్బంది చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహణ అధ్యక్షులు రమణారెడ్డి, యూత్ అధ్యక్షులు సునీల్ పాల్ రెడ్డి, సుధాకర్, సత్యనారాయణ, మరియు పావని తదితరులు పాల్గొన్నారు.