దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న తిండేరు హనుమంతరావు దంపతులు

Published: Wednesday September 28, 2022
మేడిపల్లి, సెప్టెంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ గణేష్ నగర్ వివేకానంద యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దుర్గాదేవి అమ్మవారికి స్వర్ణకవచ లంకరణతో     ఘనంగా పూజలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు తిండేరు హనుమంతరావు ఆయన సతీమణి సురేఖ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో వీరేందర్ గుప్త, చిరంజీవి, సోమ శ్రీనివాసులు, కొత్త పల్లి రమేష్, గంగాధర్, రోషన్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.