సామాన్ గడ్డ తండా కు చెందిన వ్యక్తి మృతి

Published: Friday April 30, 2021
పరిగి, ఏప్రిల్ 29, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం, వ్యక్తి మృతి చెందిన సంఘటన దోమ మండల పరిధిలోని సమన్ గడ్డ తండా లో చోటు చేసుకుంది.దోమ స్టేషన్ హౌస్ అధికారి దేవం బోట్ల రాజు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు నేనావత్ బాల్య తండ్రి హనుమానాయక్ వయసు 36 సంవత్సరములు వృత్తి కూలీ, నివాసము సమన్ గడ్డ తండా తేదీ 28.4.21 సాయంత్రం పరిగి లో కూలి పని ముగించుకుని రోడ్డు ప్రక్కన గల శేఖర్ పొలములో అన్నము తిని పండుకున్న సమయంలో అందాకా సమయం రాత్రి 9 గంటలు అయిందని హార్వెస్టర్ మిషన్ డ్రైవర్ కృష్ణ గురు దొడ్ల గ్రామము గోవిందాపురం లాలయ్య వరి చేను కోసిన తర్వాత తిరుగు ప్రయాణంలో హార్వెస్టర్ కొత్త ట్రాక్టర్ ను అతివేగముగా అజాగ్రత్తగా నడుపుతూ బాల్యం నాయక్ పైనుండి వెళ్లగా నాయక్ వాంతులు చేసుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ హార్వెస్టర్ తీసుకొని వెళ్ళిపోయాడు. తేదీ 29.4.2012 నాడు ఉదయం ఆరున్నర గంటలకు జర్పుల రాములు చూసి మృతుని తల్లికి లాలీ బాయ్ కి తెలుపగా లాలీ బాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దేవం బోట్ల రాజు తెలిపారు.