అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంభం

Published: Wednesday March 24, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి : మండలంలోని మల్లెపల్లి, పహిల్వాన్ పురం, నాతాళ్లగూడెం గ్రామాలలో మండల ప్రజాపరిషత్ 15 వ వార్షిక నిధుల నుండి మంజూరైన నిధులతో నిర్మించనున్న అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక ఎంపిపి నూతి రమేష్ రాజు మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు బొల్ల లలితా శ్రీనివాస్, ఉలిపే మల్లేశం, ఎంపిటిసిలు తుమ్మల వెంకట్ రెడ్డి, చేగురి భారతమ్మ గోపాల్, మోటే నర్సింహ, మాజీ ఎంపిటిసి ఉద్ధగిరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.