తల్లాడలో శ్రీనివాసమ్ బ్రోచర్ ఆవిష్కరణ..*

Published: Monday February 13, 2023
మేనేజింగ్ డైరెక్టర్ శెట్టి శ్రీనివాసరావు..* 
 
తల్లాడ, ఫిబ్రవరి 12 (ప్రజా పాలన న్యూస్): 
 తల్లాడ పట్టణంలోని కొత్తగూడెం రోడ్డులో ప్రధాన రహదారి పక్కన ఉన్న మైత్రి డెవలపర్స్ వారి శ్రీనివాసమ్ వెంచర్ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ బ్రోచర్ ను శ్రీనివాసమ్ వెంచర్ అధినేత శెట్టి శ్రీనివాసరావు చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 ఎకరాల సువిశాల ప్రాంతంలో ప్లాట్లను అమ్మకాలు చేస్తున్నట్లు తెలిపారు. తక్కువ ధరలో అధునాతనమైన ప్లాట్లను అమ్మకాలు చేస్తున్నట్లు వెల్లడించారు. రోడ్డుకు ఇరువైపుల ఏవెన్యూ ప్లాంటేషన్, కాంపౌండింగ్ వాల్, డ్రైనేజీ, విద్యుత్ సరఫరా, అధునాతన ఎంట్రన్స్ ఆర్చి, సెంట్రల్ లైటింగ్, పుష్కలమైన నీటి వసతి ఉందని తెలిపారు. అంతేకాకుండా  24 గంటల సెక్యూరిటీ, బ్యాంకు లోన్ సదుపాయం కూడా ఉందని, ఈ వెంచర్లు కొనుగోలు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అనంతరం క్యాలెండర్, డైరీ, పాంప్లేట్ కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు రామకృష్ణ, మైత్రి సంస్థ సభ్యులు పాల్గొన్నారు.*