19వ డివిజన్ లో మంచి నీటి పైప్ లైన్ ప్రారంభం

Published: Friday April 23, 2021
బాలపూర్, ఏప్రిల్ 22, ప్రజాపాలన ప్రతినిధి : ప్రతి కాలనీ వాసులందరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని కార్పొరేషన్ మేయర్ అన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని 19 వ డివిజన్ కార్పొరేటర్ రామోజీ అమిత శ్రీశైలం చారి ఆధ్వర్యంలో లోకాయుక్త  కాలనీలో జరుగుతున్న మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి హాజరై. నిర్మాణం చేపట్టిన పనులను ప్రారంభించారు. అనంతరం కాలనిలలో పర్యటించి కాలనీ వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కరోనా వ్యాపిస్తున్నందన ప్రతి ఒక్కరు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ చిగిరింత నర్సింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్ రామోజు అమిత శ్రీశైలం చారి, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.