ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో గణేష్ పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ కార్పొరేట

Published: Saturday September 03, 2022

మేడిపల్లి, సెప్టెంబర్2 (ప్రజాపాలన ప్రతినిధి)

గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో నెలకొల్పిన గణనాధునికి 2వ రోజున ఘనంగా పూజలు నిర్వహించారు. గణేష్ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ కార్పొరేటర్లు కక్కిరేణి చేతన హరీష్, బండారు శ్రీవాణి వెంకట్రావు పాల్గొని గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ పూజా కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగుల ప్రభాకర్ దంపతులు,తెల్కల మోహన్ రెడ్డి దంపతులు, బీజేపీ నాయకులు కక్కిరేణి హరీష్, శామీర్పేట ధర్మారెడ్డి, గొరిగే కృష్ణ, మహంకాళి లక్ష్మణ్, రావుల బాలకృష్ణ, ఫణిందర్, రెడ్డి గారి దేవేందర్ రెడ్డి, రేవల్లి రాజు, నాని నాగరాజు గౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధులు, ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డి.వెంకట్రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.నరోత్తం రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వి.తిరుపతిరెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం అధ్యక్షులు పల్లె మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎం. సురేష్ కుమార్, ఏ.వి. శ్రీధర్ రావు, సంయుక్త కార్యదర్శి జి.శివాజీ, కోశాధికారి ఆర్ యాదగిరి గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శి దాస రాజు, సలహాదారులు కె.చంద్రమౌళి, డి.సురేష్, కే. శ్రీనివాస్, వి. కిషోర్ తదితరులు పాల్గొన్నారు.