*జాతీయ రహదారిలో భూమి కోల్పోతున్న రైతులకు 2021 మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించండి* చేవె

Published: Wednesday April 05, 2023

హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిలో భూమిని కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచాలని*
హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిలో భూమిని కోల్పోతున్న రైతులకు పరిహారం పెంచాలని కోరుతూ *విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని* కలిసి వినతిపత్రం ఇచ్చిన **తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి చేవెళ్ల సర్పంచ్ శైలజా ఆగిరెడ్డి*
హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిలో భూమిని కోల్పోతున్న రైతులకు 2018 మార్కెట్ విలువ ప్రకారం పరిహారం ఇస్తున్నారని బహిరంగ మార్కెట్ లో భూముల విలువ 2కోట్లకు పైన ఉన్నదని 2021లో ప్రభుత్వం పెంచిన మార్కెట్ విలువ ప్రకారమైన పరిహారం ఇప్పించేందుకు కృషి చేయాలని మరియు చేవెళ్ల బైపాస్ రోడ్డుకు అనుకోని సర్వీస్ రోడ్డు అభివృద్ధి చేసే విదంగా చూడాలని  మంత్రి గారిని కోరారు దీనికి స్పందించిన మంత్రి గారు కలెక్టర్ మరియు జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు
ఈకార్యక్రమంలో భూములు కోల్పోయిన రైతులు *పాటి దామోదర్ రెడ్డి, జుకన్నగారి శ్రీకాంత్ రెడ్డి,బండారి వెంకటరెడ్డి రవీందర్ రెడ్డి,బల్వంత్ రెడ్డి మధుసూదన్ రెడ్డి,మందుముల ప్రభు,అల్లాడా నర్సింహారెడ్డి, భోజిరెడ్డి,ఇబ్రహీంపల్లి వెంకటరెడ్డి గుడిసె పెంటయ్య మొయినాబాద్ సతీష్* రైతులు
పాల్గొన్నారు