సీఎం సహాయనిది ద్వారా మంజూరైన చెక్కులను అందజేత : ఎమ్మెల్యే సంజయ్

Published: Monday December 20, 2021
జగిత్యాల, డిసెంబర్, 19 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టణానికి చెందిన నంబి పార్థసారథి తండ్రి నరసింహ చారి కి  సీఎం సహాయనిది ద్వారా మంజూరైన 2 లక్షల విలువగల చెక్కును వేణుగోపాల స్వామి ఆలయ అవరణలో అందజేసి అనంతరం పట్టణ 45 వ వార్డు కు చెందిన శీలం సురేష్ కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 90 వేల రూపాయల విలువగల చెక్కును సురేష్ ఇంటి వద్ద ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అందజేసినారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బొడ్ల జగదీష్, క్యాదాసు నవీన్, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ మెంబర్ టివి సూర్యం, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు శీలం ప్రవీణ్ తదితరులు ఉన్నారు.