టీఎస్ యుటిఎఫ్ జిల్లా మహాసభల్లో మండల ఉపాధ్యాయ బృందం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద

Published: Monday November 21, 2022
బోనకల్ ,నవంబర్ 20 ప్రజాపాలన ప్రతినిధి: టియస్ యుటియఫ్ ఖమ్మం జిల్లా 5వ మహా సభల్లో బోనకల్ మండల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ఆదివారం వైరా పట్టణంలో జరిగిన టియస్ యుటియఫ్ ఐదవ జిల్లా మహాసభల్లో బోనకల్ మండలం నుండి అత్యధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈసందర్భంగా టియస్ యుటియఫ్ జిల్లా కోశాధికారి వల్లం కొండ రాంబాబు ,మండల ప్రధాన కార్యదర్శి గుగులోతు రామకృష్ణ మాట్లాడుతూ సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని,అపగ్రేడేషన్ చేసిన పండిట్, పిఇటీ పోస్టులలో వారికి పదోన్నతులు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానాని నిలుపుదల చేసి డియస్సీ నిర్వహించాలని, ఆదాయ పన్ను స్లాబులను మార్పులు చేయాలని,కెజిబివి , యుఆర్ యస్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని,బిసి వేల్పర్ పాఠశాల సమయాన్ని మార్చి అనేక తీర్మానాలు ఈ మహాసభలో చేసినట్లు తెలియజేశారు.ఈమహాసభల్లో టీఎస్ యుటిఎఫ్ మండల అధ్యక్షులు బి ప్రీతం ,కోశాధికారి కె.రమేష్, ఉపాధ్యక్షులు యంసిఇర్ చంద్రప్రసాద్,సధాబాబు కె.సౌ భాగ్యలక్ష్మి, నిర్మల, రాణి,భవాని, బిసివేల్పేర్ రాష్ట్ర నాయకులు లెవీన్, పి.గోఫాల్ రావు, మురళి, చిన్నరంగారావు, రామకృష్ణ, రంజాన్ అలీ, రాములు, నరసింహారావు, శ్రీనివాసరావు, రామారావు తదితరులు తదితరులు పాల్గొన్నారు.