ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 19ప్రజాపాలన ప్రతినిధి *వజ్రోత్సవ సంబరాలను విజయవంతం చేయండి* *ఎస్టీ

Published: Tuesday December 20, 2022
గత 75 సంవత్సరాల సంఘ ప్రస్థానం లో ఉపాధ్యాయ హక్కులకై , విద్యా రంగ పరిరక్షణకై ఎన్నో ఉద్యమాలు చేసిన ఘనత ఎస్టీయూ సంఘానిదని, ఎన్నో  శాశ్వత ప్రయోజనాలను ఉపాధ్యాయ లోకానికి అందించిందని,ఇక ముందు కూడా ఉపాధ్యాయ సమస్యల,విద్యారంగ పరిరక్షణకు ముందుండి నడిపిస్తుందని ఆ సంఘ ఇబ్రహీంపట్నం  మండల అధ్యక్షులు మహేష్ అన్నారు.ఎస్టీయూ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా  డిసెంబర్ 26 న .యాం ఈ రెడ్డి గార్డెన్ వనస్థలిపురం లో నిర్వహించబోయే రాష్ట్ర స్థాయి స్థాయి వజ్రోత్సవ సంబరాల్ని విజయవంతం చేయాలని,ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని తెలియజేశారు
ఈ సందర్బంగా ఇబ్రహీంపట్నం ఎంపీపీ శ్రీ కృపేష్, ఎంపీడీవో జయరాం విజయ్,ఎంఈఓ శ్రీ వెంకట్ రెడ్డి  ఏ ఈ  ఇంద్రసేనా రెడ్డి గార్లచే గోడపత్రిక ఆవిష్కరణ గావించారు. ఈ కార్యక్రమం లో  మండల ఎస్టీయూ అధ్యక్షులు మహేష్,ప్రధాన కార్యదర్శి తిరుమలేశ్ , జిల్లా ఉపాధ్యక్షులు రాజశేఖర్ ,యాదగిరి ,గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు...