పెళ్లిరోజు సందర్భంగా మొక్కలు నాటిన న్యాయవాది దంపతులు

Published: Saturday September 03, 2022

మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 02, ప్రజాపాలన : పెళ్లిరోజు సందర్భంగా మొక్కలు నాటిన న్యాయవాది దంపతులు శుక్రవారం రోజు న్యాయవాది రాజలింగు, ప్రభుత్వ ఉపాధ్యాయురాలు రజిత వారి పెళ్లిరోజు సందర్బంగా అల్లూరి సీతారామరాజు నగర్ లో న్యూ యూత్ గణేష్ మండలి వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు వారి పుట్టిన రోజు, పెళ్లిరోజు ఇతర ముఖ్య సందర్భాలలో తప్పనిసరిగా మొక్కలు నాటి ప్రాణవాయువుకు ఊపిరి ఊదాలన్నారు. భవిష్యత్ తరాలకు చక్కని ప్రకృతి సంపదను ఇచ్చేందుకు ప్రతీ ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, న్యూ యూత్ గణేష్ మండలి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.