ఐటీ దాడులకు నిరసనగా పీర్జాదిగూడలో రాస్తారోకో దిష్టిబొమ్మ దగ్ధం

Published: Thursday November 24, 2022
మేడిపల్లి, నవంబర్ 23 (ప్రజాపాలన ప్రతినిధి)
కేంద్రం ప్రభుత్వం,బీజేపీ పార్టీ నాయకులు అవలంబిస్తున్న కుటిల రాజకీయాలను తిప్పికొడుతూ, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ,ఆరాచక పాలన కొనసాగిస్తూ రాష్ట్ర కార్మిక& ఉపాధి కల్పనా శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి ఇంటిపై జరుగుతున్న ఐటి దాడులకు నిరసనగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్  మేయర్ జక్క వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో మేడిపల్లి వరంగల్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి, బీజేపీ పార్టీ, నరేంద్ర మోడీ దిష్టి బొమ్మ దహన కార్యక్రమం చేపట్టడంతో పాటు కేంద్రం ప్రభుత్వం, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దొంతరి హరి శంకర్ రెడ్డి, మద్ది యుగంధర్ రెడ్డి, సుభాష్ నాయక్, కౌడే పోచయ్య, అనంతరెడ్డి, బచ్చ రాజు,
కొ-ఆప్షన్ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి, రాందాస్ గౌడ్, తెరాస నాయకులు బండారి రవీందర్, లేతాకుల రఘుపతి రెడ్డి, రఘునందన్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.