పలు అభివృద్ధి పనులకు భూమి పూజ, ప్రారంభోత్సవాలు

Published: Monday January 31, 2022

వెల్గటూర్, జనవరి 30 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలంలోని గుల్లకోట గ్రామములో సోమవారం రోజు మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి పనుకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలకు గ్రామానికి వస్తున్నట్లు తె.రా.స మండల శాఖ అధ్యక్షులు సింహాచలం జగన్ ఒక ప్రకటనలో తెలియజేశారు. 6500000 సి.అర్.అర్ నిధులతోఎస్ సి కాలనీ నుండి ఒడ్డెర కాలనీ వరకు రోడ్డు, 6500000 సి.అర్.అర్ నిధులతో ముదిరాజ్ వాడలో, 500000.సి.సి ఎస్.డి.పి నిధులతో సకినాల శంకరయ్య ఇంటి వద్ద 500000 సి.సి ఎస్.డి.పి.రోడ్డు,460000 డి.ఎమ్.ఎఫ్.టి  నిధులతో రజక సంఘ భవనం, మాన్ గ్రెస్ కంపోస్ట్ షెడ్ 220000 నిధులు, మాల్ గ్రేస్ గ్రామ పంచాయతీ నిధులు 1600000 వైకుంఠధామం, గ్రామ పంచాయతీ నిధులు 600000. 2200000 నిధులతో రైట్ వేదిక గ్రామానికి సంబంధించిన మొత్తం పనులు 1,25,80,000 తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారముతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఈ పనులకు భూమి పూజ ప్రారంభోత్సవాలు మంత్రి  వస్తున్న సందర్భంగా ప్రజాప్రతినిధులు నాయకులు రైతులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సింహాచలం జగన్ ఒక ప్రకటనలో కోరారు