చోప్పకట్లపాలెం లో అధిక విద్యుత్ బిల్లుల మోత
Published: Thursday April 14, 2022
విద్యుత్ శాఖ అధికారులను అడగగా పట్టించుకోని వైనం
బోనకల్,ఏప్రిల్ 13 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని చొప్పకట్లపాలెం గ్రామంలో అధిక విద్యుత్ బిల్లుల మోతకు విద్యుత్ వినియోగదారులు లబోదిబోమంటున్నారు. గ్రామానికి చెందిన నంజాల నాగేశ్వరరావు ఇంటికి ఏప్రిల్ నెలకు గానూ విద్యుత్ రీడింగ్ తీయగా 19567 రూపాయలు బిల్లుగా వచ్చింది. సామాన్య కుటుంబానికి చెందిన నాగేశ్వరరావు వ్యవసాయ పనుల నిమిత్తం ప్రతిరోజు పొలం పనులకు వెళ్తుంటారు. ఇంటిలో కూడా విద్యుత్ ఆధారిత లోడ్ పడే గృహోపకరణాలు ఏమీ లేవు. ఇదేమిటని విద్యుత్ శాఖ అధికారులను నాగేశ్వరరావు ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వడం లేదని వాపోతున్నారు. గతంలో ఎన్నడూ 300, 400 రూపాయలు మాత్రమే బిల్లు వచ్చేదని ఇప్పుడు ఏకంగా 20వేల రూపాయలు రావడం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. తనకు న్యాయం చేయాలని ఆయన వేడుకుంటున్నారు. గ్రామంలో కూడా ఇలా చాలా మందికి అధిక బిల్లులు వచ్చాయన గ్రామ ప్రజలు వాపోతున్నారు.
Share this on your social network: