పీర్జాదిగూడ కార్పొరేషన్లో అంగరంగ వైభవంగా బోనాల పండుగ ఉత్సవాలు

Published: Monday July 25, 2022
మేడిపల్లి, జూలై24 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బోనాల పండుగను                   ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి ఆలయాలకు చేరుకొని బోనాల సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. బోనాల పండుగ ఉత్సవాలను పురస్కరించుకొని 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రాంతి కాలనీ శ్రీ పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ఆశీర్వాదాలు తీసుకున్న మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు అనంత రెడ్డి, సుభాష్ నాయక్. బోనాల పండుగ సందర్భంగా 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి సతీసమేతంగా శ్రీ పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని బోనం మరియు ఓడి బియ్యం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 25వ డివిజన్ కాలనీ వాసులు,మహిళలు, నాయకులు పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు.