టీటీడీ బోర్డు సభ్యులుగా నియామకం అయిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు ఘనంగా సన్మానం

Published: Monday October 04, 2021
కోరుట్ల, అక్టోబర్ 03 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల పట్టణంలోని మినీ పద్మనాయక కల్యాణ మండపంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ అధ్యక్షతన జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశం అనంతరం ఇటీవల టీటీడీ బోర్డు సభ్యులుగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు నియామకం అయినా సందర్బంగా వారిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, కలెక్టర్ జి.రవి నాయక్, డీసీఏంసీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా పరిషత్ సభ్యులు, ఎంపీపీ లు, జడ్పీ సీఈఓ సంధ్యారాణి, జిల్లా స్థాయి అధికారులకు తదితరులు పాల్గొన్నారు.