మండలంలో గడియారాలను పంపిణీ చేసిన దయానంద్..

Published: Wednesday July 20, 2022

తల్లాడ, జులై 19 (ప్రజాపాలన న్యూస్):

 

తల్లాడ మండలంలో టిఆర్ఎస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. మండలంలోని కలకోడిమ కుర్నవల్లి, గోపాలపేట, బాలపేట మల్లవరం గ్రామాల్లో పర్యటించారు. ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె స్వప్నిరెడ్డి వివాహ రిసెప్షన్ వేడుక ఆగస్టు 17న ఖమ్మంలోని ఎస్ ఆర్ గార్డెన్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి అందరూ కుటుంబ సమేతంగా హాజరు కావాలని ఆహ్వాన పత్రికతో పాటు గోడ గడియారాన్ని (గిఫ్టుగా) అందించారు. ఆయనతోపాటు ఖమ్మం డిసిసిబి మాజీ చైర్మన్ మువ్వ విజయబాబు చేతుల మీదుగా వీటిని పంపిణీ చేశారు. అనంతరం దయానంద్ మాట్లాడుతూ ఆగస్టు 17న ఖమ్మంకు కుటుంబ సమేతంగా అందరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వారి వెంట టిఆర్ఎస్ పార్టీ నాయకులు గణేషుల రవి, కొమ్మినేని వెంకటేశ్వరరావు(కేవీ), గోపిశెట్టి వెంకటేశ్వర్లు, గోపాలపేట గ్రామ సర్పంచ్ నల్లమోతు మోహన్ రావు, తెదేపా మండల పార్టీ అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు, నాయకులు పొన్నం కృష్ణయ్య, తుమ్మలపల్లి రమేష్, గొడుగునూరి లక్ష్మారెడ్డి, పొట్టేటి బ్రహ్మరెడ్డి, చల్లగుండ్ల కృష్ణ, ఎర్రి నరసింహారావు, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్. యాకూబ్ పాషా, వివిధ పార్టీల నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు