ఉప్పల్ బస్ డిపో వద్ద ధర్నాలో పాల్గొన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అఖిలపక్ష నాయకులు

Published: Tuesday September 28, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిలపక్ష పార్టీల పిలుపుమేరకు తలపెట్టిన భారత్ బంద్ లో భాగంగా ఉప్పల్ బస్ డిపో ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీగా నాయకులు, కార్యకర్తలు ధర్నా లో పాల్గొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అఖిలపక్షం ధర్నాలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం, అజీజ్ పాషా, తోటకూర జంగయ్య యాదవ్, టిడిపి నాయకులు అశోక్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు మందముళ్ళ పరమేశ్వర్ రెడ్డి, బోరంపేట కృష్ణ, తెల్కల మోహన్ రెడ్డి, రఘుపతి రెడ్డి, గిరిబాబు, తౌఫిక్, సుర్వి మురళి గౌడ్, జలీల్ పశ, కాలేరు నవీన్, రఫీక్, ప్రకాష్ రెడ్డి, కొంపల్లి బాలరాజ్, బాకారం లక్ష్మణ్, అరుణ్ (యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు) సుధాకర్ శెట్టి, శ్రీనివాస్ యాదవ్, లూకాస్, సుధాకర్, సురేష్, అలీం, అఖిల పక్షం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.