యాదగిరిగుట్ట మండల పరిషత్ కార్యాలయ రాత్రి కాపలా దారుడు పిలక కృష్ణ అకాలమరణం

Published: Thursday October 06, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 4 ప్రజాపాలన:
రాత్రి కాపాలదారుడు పిలక కృష్ణ అకాల మరణం చెందారు.యాదగిరిగుట్ట  మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాత్రి కాపలా దారుగా (నైట్ వాచ్ మెన్) పనిచేస్తున్న పిలక కృష్ణ మంగళవారం నాడు అకాలమరణం చెందాడు. యాదగిరిగుట్ట మండలం పరిషత్ కార్యాలయంకు రాకపూర్వం   భువనగిరి పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ డివిజన్  కార్యనిర్వాహక ఇంజనీర్ ఇంజనీర్ కార్యాలయంలో పనిచేశారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ డివిజన్ కార్యాలయంలో పలువురి అధికారుల ప్రశంసలను అందుకున్నారు. రాత్రి కాపలా దారుడు పిలక కృష్ణ అకాలమరణానికి పలువురు అధికారులు స్నేహితులు బంధువులు ప్రగాఢ సంతాపం తెలిపారు. తనతో గడిపిన క్షణాలను అధికారులకు చేసిన సేవలను పలువురు కొనియాడారు. బొమ్మల రామారం మండల ప్రజా పరిషత్ పర్యవేక్షకులు గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ... కృష్ణ అందరితో ఎంతో ఆత్మీయంగా మెలిగేవాడని తనతో ఉన్న అనుబంధం గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ కళ్లు చెమర్చాయి.
 మోత్కూర్ మండల 
 సీనియర్ అసిస్టెంట్ యస్.రాంరెడ్డి మాట్లాడుతూ భువనగిరి ఇంజనీరింగ్ డివిజన్ కార్యాలయంలో మరియు  యాదగిరిగుట్ట లో పని చేసే రోజుల్లో  కృష్ణ తో ఎక్కువ అనుబంధం ఉందన్నారు. 
సంగారెడ్డి జిల్లా ఆందోల్ డివిజన్ పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంజయ్య తాల్క మాట్లాడుతూ... కృష్ణ ఎంతో ఆత్మీయంగా మెలిగేవాడని అందరి మన్ననలను పొందేవారు అని అన్నారు.కృష్ణ అకాలమరణం తీవ్ర మనస్థాపానికి గురిచేసిందన్నారు.
పిలక కృష్ణ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మిషన్ భగీరథ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధనుంజయ రెడ్డి సిబ్బంది కాంట్రాక్టర్ లు ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు  కోరుకుంటున్నారు.